Friday, November 25, 2011


పోలిస్వర్గం


రేపు పోలిస్వర్గం! దీని గురుంచి ఒక కధ వుంది మా అమ్మగారు చెప్పారు.
స్త్రీల వ్రతకదల పుస్తకం లోకూడావుంది


అనగా అనగా ఒక ఊరులో,అన్ని కులాల వాళ్ళు నివసిస్తూ వుంటారు అందులో చాకలి కులం
వారు వుంటారు. పోలి అనే ఆవిడ ఎప్పుడు దేవుణ్ణి భక్తిశ్రద్ధలతో కొలుస్తూ వుంటుంది.
మిగత తోటికోడళ్ళు ,అత్తగారు ఆమెని చిన్న చూపు చూస్తారు. ఎప్పటి
లాగే వచ్చే కార్తిక మాసం ఆఖరిరోజున నది కి వెళ్లి దీపాలు వెలిగించాలని అనుకుంటుంది. కాని అత్తగారు
మిగిలిన కోడళ్ళు ఆమెకి చెప్పకుండా నది దగ్గరకి వెళ్ళిపోతారు. ఆమెకి
వత్తులు, నెయ్యి మొదలయిన సంబరాలు ఉంచకుండా చేస్తారు.
అప్పుడు ఆమె దేవుణ్ణి తలచుకుంటూ ఉన్నవాటి తో తయారు చేసుకొని నది కి వెళ్లిదీపాలు వదులుతుంది.
అది చూసి దేవతలుఆమెని బొందితో స్వర్గానికి తీసుకువెళ్ళడానికి పుష్పకవిమానం లోవస్తారు.
అది చూసిఊరులో వాళ్ళు ఆమె అత్తా,తోటికోడళ్ళు ఆహ ఎంత భాగ్యం, ఎంతపుణ్యం కదా! మన
పోలి బొంది తో స్వర్గం కి వెళ్ళింది అని ఆమె గురుంచి వేనోళ్ళ పోగుడుకుంటారు.


అప్పటి నుంచి ప్రతి కార్తిక మాసం చివరరి
రోజున
" పొలమ్మ స్వర్గం అందరు చేస్తున్నారు"

No comments:

Post a Comment