Saturday, December 22, 2012

శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చే పర్వదినం ముక్కోటి ఏకాదశి




శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చే పర్వదినం ముక్కోటి ఏకాదశి.


ఈ రోజున ఆయనను దర్శనం చేససుకొంటే సమస్త పాపాలు తొలిగి పోతాయని పెద్దలు చెబుతారు.

శ్రీ మహావిష్ణువు షోడశనామస్తుతి

ఔషధే చింతయే ద్విష్ణుం భోజనే చ జనార్ధనమ్,
శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిమ్.

యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ ప్రజాపతిమ్,
నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే.

దుస్స్వస్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్,
కాననే నారసింహం చ పావకే జలశాయినమ్.

జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనమ్,
గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవమ్.

షోడశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్,
సర్వపాప వినిర్ముక్తో విష్ణు లోకే మహీయతే.

Saturday, December 1, 2012

బ్లాగర్  మిత్రులందరికీ,
ఈ నెల కదాకౌముది లో నా మొట్ట మొదటి కద'కృష్ణం వందేజగద్గురం' ప్రచురించారు.చదివి మీ అభిప్రాయం తెలుపగలరు.

Sunday, September 30, 2012

మరో ప్రళయం




  

ఆకాశం  వేదనతో  ఆవేదనగా రోదిస్తోంది
పృథ్వి మౌనంతో  భారాన్ని మోస్తు భాధను భరిస్తోంది
సాగరం క్రోధంతో  ఉవ్వేత్తున్న ఎగిసి పడుతోంది
వాయవు బలంతో  ప్రచండం గ వీస్తున్నాడు
భగ్గుమన్న ప్రతాపంతో మింటి కెగసిన అగ్ని జ్వాలలు      
పంచభూతాలు మానవుడి మీద పగ పట్టినట్లు
మరో ప్రళయానికి  నాంది పలికాయి
మరో ప్రళయానికి  నాంది పలికాయి



Monday, August 20, 2012

పోలాల అమావాస్య -గురుంచి నేను పంపిన వివరాల ను,విశేషములను వెంటనే ప్రచురించిన శ్రీ రావు గారికి (శిరా కదంబం ) ధన్యవాదములు

మన ఆంధ్ర దేశం లో ఎన్నో  నోములు ,వ్రతాలూ వున్నాయి అందులో  కొన్ని మరుగున  ప డి  పోతున్నాయి అలాంటి దే ఈ పోలాల అమావాస్య.ప్రతి  ఏడాది  శ్రావణ అమావాస్య నాడు వస్తుంది . 

ఈ నోము గురుంచిన  విశేషాలు  


ఈ క్రింద లింక్  లో  https://sites.google.com/site/siraakadambam/devotional/polalaamavasya-manimurtivadlamani




పూర్వఫల్గుణి 

Wednesday, July 25, 2012

మళ యాళ సినిమా"ప్రణయం"పరిచయం

బ్లాగర్  మిత్రులందరికీ ,

నిన్న  నేను  ఒక మళ యాళం  సినిమా  చూడటం జరిగింది. ఇది కూడా  ఎలా అంటే మొన్న  దుబాయి  లో జరిగిన దక్షిణ భారత సినిమా అవార్డు  లో  ఈ సినిమా గురుంచి  వినడం జరిగింది.అందులో  నటించిన  నటి నటులు  వివరాలు తెలిసాక ఇంకా చూడాలనిపించింది .


బాష పూర్తిగా  తెలియక పోయిన   ప్రయత్నం చేసి చూసాను .అద్భుతం . కొంచెంసేపు  వరకు ఆ మూడ్ నుండి  బయటకు  రాలేకపోయాను. 
సిన్మా  ఆఖర్న కళ్ళ  వెంబడి నీళ్లు అలా ధా రలుగ  కారుతూనే వున్నాయి ఒక  మంచి  సినిమా  అని ఎన్నిసార్లో  అనుకున్నాను 
ఇంకా  సినిమా లోకొస్తే  సినిమా పేరు "ప్రణయం " అసలు  పేరుకే  నేను పడిపోయాను .జయప్రద,మోహన్ లాల్ &అనుఫమఖేర్ ఇంత  మంచి తారాగణం వుంటే  ఆ సినిమాకి  అవార్డ్స్  పంట  పండకుండా   వుంటుందా ?సరే ఇంకా విమర్శకులు  మెప్పు కూడా  అదనపు పంట ఈ సినిమాకి  
.
ఒక  స్త్రీ   తన  జీవితం  లో  రెండుసార్లు  వివాహబంధం  కలిగివుంటే.తన  మనసు  ఎలావుంటుంది ? అది జీవిత చరమాకంలో కలుసుకొన్నప్పుడు  ఆ ఇద్దరు  ఆమె అంతరంగ మధనాన్ని అర్ధం చేసుకొని  వాళ్ళు  ఆమెకి  సహకరించడం ఇంకా చాల ఉన్నతం గ వుంది.దర్శుకుడు  ఒక  వైవిధ్యమైన కధని ఎంతో  నేర్పుతో  మరెంతో ఉన్నతం గ తీర్చి దిద్దాడు 


జయప్రద  సహజం గానే అద్భుత నటి,సాగరసంగమం లో చూశాం ,మోహన్ లాల్  గురుంచి అనుపంఖేర్ గురుంచి చెప్పాలిసిన పనిలేదు 
వెరసి  ఒక మంచి సినిమా ఎటువంటి మసాలాలు  లేకుండా పూర్తిగా  కధను  నడిపించాడు దర్శకుడు (బ్లేస్సి )


ఈ సినిమా గురుంచి  Wikipedia లో 

Plot:The film's plot is similar to Paul Cox's Australian film Innocence

The film begins with Achutha Menon (Anupam Kher), a man in his late sixties arriving in the city to stay with his daughter-in-law and grand-daughter after suffering a heart attack. He was a football player who had got selected in the State team but could never play for the team. He moulded his life and career to accommodate the romance in his life.
One day Menon sees his former wife Grace (Jaya Prada) in the elevator and collapses. Grace, who is staying in the same building with her husband, daughter and son-in-law, arranges for him to be taken to the hospital and even pays the deposit for the emergency treatment. Slowly their relationship is revealed as she is very anxious about his condition.
Grace's husband Mathews (Mohanlal) is a philosophy professor who has his own philosophy of life. He is now bedridden and requires his wife's help to accomplish the most basic day-to-day tasks. Their physical intimacy is an indication that they may have led a fulfilling life as a couple before the tragedy struck.
The children start acting up as the old couple revive their acquaintance. In the later half of the film, even Mathews joins the former couple with Achuthan helping Grace in manoeuvring her husband's wheelchair in rough terrains. The three take a trip to a beach resort together.
At the resort, Mathews has a stroke and is rushed to the hospital. At the same hospital, Grace has a heart attack and dies, while Mathews survives.

[edit]Cast










వీలుంటే  అందరు  తప్పకుండ చూడండి 


మీకోసం  ఆ లింక్ 
http://www.pranayamthemovie.com


Sunday, July 1, 2012

ఈ వారం కథ తెరుచుకునే తలుపులు * ఆకునూరి హాసన్* ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో





ఈ కధ బావుంది సింపుల్ గ  ఆలోచింపచేసేలా వుంది .
ఇందులో  జీవనసత్యాన్నిబాగాచెప్పారు అలాగే మానవుడు ఆశావాది అనే మాటను  తన ఈ కధ ద్వార బలపరచారు  హసన్ గారు!!! 

తెరుచుకునే తలుపులు

 ఆకునూరి హాసన్

గేటు తీసుకుని భేతాళుని శవంలా భుజాల నుంచి గుండెల వరకూ పట్టి వదలని ఆలోచనల్ని మోసుకుంటూ, లోపలికి వెళ్ళి వరండాలోని ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని పైకి చూస్తే, నిలువుగా టేకు దూలాలు, పై నుంచి వేలాడే లైట్, ఫ్యాన్. అక్కడే ఉన్న తెలుగుపేపర్ తీసుకుని పేజీలు తిప్పుతుంటే - లోపల్నుంచి బయటకు అడుగుల చప్పుడు. ముతక నేత చీరలో వయోభారంతో వంగిన పెద్దావిడ బయటకు వచ్చింది. 


కుర్చీలో సరిగా కూర్చుని, రోజులాగే నవ్వి పొగలు కక్కే ఫిల్టర్ కాఫీ గ్లాస్ అందుకున్నాక -
"ఫోన్ చేశాడా? మెసేజ్ ఏమన్నా పెట్టాడా'' అడిగిన ఆ పెద్దావిడకి -
"లేదమ్మా. ఈ రోజు మెసేజ్, మెయిల్ పంపుతా. ఎవరైనా వచ్చారా?'' అని అడిగితే పెదాలు చిన్నగా విరిచిన ఆమె ... ఎక్కడికో జీవితపు తలుపులు తెరుచుకుని, చీకట్లోకి అడుగు పెడుతున్నట్లుగా ఓ సారి వీధివైపు చూసి, అక్కడే చూపులు ఆపింది. ఆమె ఒక్కగానొక్క కొడుకు - నలభై ఏళ్ళ మహర్షి రెండేళ్ళ కిందట ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎప్పటికప్పుడు 'వచ్చేనెలలో వచ్చేస్తున్నాను' అంటూ చెబుతూ నెలలు గడుపుతుంటే, ఇన్నాళ్ళు ఆవిడా, నేనూ ఎదురుచూడ్డంలో గడిపేశాం. ఇంటిని 'కబళిద్దామని' చూస్తూ ఇంటి చుట్టూ తిరిగే అప్పులవాళ్ళు ... ఒంటరిగా ఆవిడా.

వేడి కాఫీ నాలుక మీద చురుక్కుమంది. జ్ఞాపకాల్లా అనుభవాల్లా జీవితంలా వగరుగా తగిలింది.
కొడుకు గురించి ఏమైనా చెబుతానని మరికొన్ని క్షణాలు నిలబడిన ఆవిడ కాసేపటికి దిగులుగా దేన్నో వెతుకుతున్నట్లుగా, జారిపోయే గాజుపురుగులా పొడవాటి ఇంట్లోకి ... గుమ్మాలు దాటుకుంటూ వెళ్ళిపోయింది.
పేపర్లోని వార్తల్ని కాఫీతో కలిపి చప్పరిస్తూ రెండూ ముగించాక మళ్లీ కళ ్ళ లోయల్లో, గుండె లోపల ఎక్కడో, ఏవో తలుపులు తెరుచుకున్నాయి. లోపలి చీకట్లోకి ... ఏదో పరిమళం ఊపిరికి తగుల్తుంటే, ఏ చివరి గదిలోనో, తెరిచీ తెరవని కిటికీ తలుపుల్ని, తెరిచే ప్రయత్నం చేస్తూ ఏవో నాజూకు చేతులు, మెరిసే వేలికొసలు, నక్షత్రాల్లా కళ్ళు, ఎర్రని పెదాలు ... చల్లని స్పర్శ ... కాంచన !

నవ్వే కళ్ళు, నవ్వని పెదాలు "ప్లీజ్, నాకోసం ఏమైనా చేయవూ'' గుండెలోకి నీళ్ళు నిండిన కళ్ళని, చూపుల్ని గుచ్చి అడిగే అందమైన అమ్మాయికోసం ఎందుకివ్వలేం ... ప్రాణాలైనా సులువుగా?
ఖాళీ అయిన కాఫీ గ్లాసుని నేలమీద పెట్టి ఆలోచనల్లోంచి బయటకి, ఇంట్లోంచి బయటకి వచ్చేస్తే ... ఇందాక తెరుచుకున్న ఏదో తలుపులోంచి మళ్లీ చీకట్లోకి జారుకుని మాయమైన జ్ఞాపకాలూ, రూపాలూ ...

మూడురోడ్ల కూడలి. అటూ ఇటూ వెళ్తూ మనుషులూ, వాహనాలు. ఎటు వెళ్లేది? క్షణంలో వందో వంతు డైలమా. అయినా యధాలాపంగా మళ్ళీ ముందుకే. ఆటోలు, మనుషులు. అప్పుడప్పుడూ నవ్వే, విష్ చేసే ఎన్నో ముఖాలూ ... మళ్ళీ చౌరస్తా. అక్కడ కేవలం జ్ఞాపకంగా మిగిలిన క్లాక్‌టవర్‌లా, కుప్పకూలిన ఆలయగోపురంలా కంటికి కనిపించకుండా రెండు ప్రశ్నలు. రెండు రూపాలు. ఇద్దరు మనుషులు. రెండు వేర్వేరు జీవితాలు. అనుభవాలు, జ్ఞాపకాలు, విషాదాలు. ఒకవైపు మహర్షి అనే మిత్రుడు. మరోవైపు కాంచన అనే ప్రియురాలు. రెండువైపులా రెండుదారులు. ఎదురుగా విశాలమైన రాజవీధి. ఎటువైపు వెళ్తే ఇద్దరిలో ఒకరైనా కనిపిస్తారు? ఎవరు హేండ్ ఇస్తారు? ఎవరు చెయ్యి అందుకుంటారు?

దాదాపు రెండేళ్ళ కిందట మాయమైన ఇద్దరు ... ఒకరు కరెన్సీ కట్టలు తీసుకెళ్తే, మరొకరు ఏ విలువ లేని హృదయాన్ని తీసుకెళ్ళిపోయారు. "నేను నాకు రావాల్సిన డబ్బుల్తో వస్తాను. నీకు ఇవ్వాల్సింది ఇస్తాను. అప్పటిదాకా, అమ్మనీ, ఇంటినీ జాగ్రత్తగా చూసుకో'' అని ఒకరు. "నన్ను మర్చిపోకు. వదిలిపెట్టకు. నీ దగ్గరకి వచ్చేంతవరకూ అక్కడే ఎదురుచూస్తుండు'' అని మరొకరు. విడి విడిగా వేరువేరు సందర్భాల్లో మాట తీసుకున్న వాళ్ళిద్దరూ ఎప్పుడొస్తారు? ఏ దారిలో వెళ్తే దొరుకుతారు?
అనుకున్నవన్నీ, ఆశపడినవన్నీ అలాగే జరుగుతాయా?
జనంలో ఉన్నా ఒంటరిగా వెళ్తున్నట్లే ఉంది. అన్నిటినీ, అందరినీ దాటుకుని ముందుకు నడుస్తూ ఆఫీస్‌కి చేరి ... ఏదో పుస్తకంలో లీనమై, తలుపులోంచి బయటకి ... వేపచెట్టునీ, ఆకుల్ని గలగల మనిపించే రావిచెట్టునీ, కొమ్మల ఆకుల మధ్యనించి కనిపించే చిన్న చిన్న నీలపు అద్దం ముక్కల్లాంటి ఆకాశాన్ని చూస్తుంటే మిలమిలలాడే ఎండలోంచి లోపలికి అడుగుపెట్టాడు యుగంధర్ "వాట్ మిస్టర్, ఏంటి విశేషాలు'' అంటూ. ఆయనొక టీవీ చానల్లో ఎడిటర్.

పుస్తకంలోంచి బయటపడి, నవ్వి "ఈ రోజు ఎం డా, చల్లగాలీ .... పాత జ్ఞాపకాల్ని నిదురలేపుతూ, కొత్త అనుభవాల్ని ముడుచుకునేలా చేస్తున్నాయ్'' అన్నాను.
"సినిక్‌లా మాట్లాడకు. పనేమీ లేకపోతే అలా సముద్రం వరకూ వెళ్దాం. హండ్రెడ్ పైపర్స్ ఊదుకుందాం పద'' అన్నాడు యుగంధర్. అతని మాటల్తో లోపలేదో కదిలి, ఆఫీసు లాక్ చేసి, బజార్లు, జంక్షన్లు దాటుకుని నల్లత్రాచులాంటి తారురోడ్డుమీద జర్రున ప్రయాణం - బైక్ మీద. రోడ్డుకు రెండు వైపులా చెట్లు. వంతెన దాటాక పొడవుగా అనకొండలాగా సింగిల్ రోడ్.

ఫారెస్ట్ హేచరీ, నేరేడుచెట్లు, చిక్కటిఅడవిలాంటి జీడి తోటలూ, సర్వి తోపులూ, ఒళ్లు కాలాక పొడలుగా ఊడే బెరడులాంటి చర్మంలా యూకలిప్టస్ చెట్లు ... ఆ తర్వాత విశాలమైన ఇసుక మైదానంలాంటి పర్ర, చప్టా ... అదీ దాటాక ఎత్తుగా చెలియలి కట్ట ... వెనకనుంచి అలల హోరుతో రమ్మంటున్న సముద్రఘోష. చెవుల్లో, గుండె గదుల్లో, సుడిగాలిలాంటి జ్ఞాపకాలు. మళ్ళీ లోపలెక్కడో తెరుచుకుంటున్న తలుపులు. ఏదో గదిలోకి చిటికెన వేలు పట్టుకుని తీసుకెళ్తున్నట్లుగా బాల్యంలోనో ... యవ్వనంలోనో ... మధ్య వయసులోనో ... ఏదో రూపం ... రెండు కళ్ళు ... హృదయం రంపంతో మెత్తగా కోస్తున్నట్లుగా ... శబ్దమే నిశ్శబ్దంలా మారిపోతూ.. సముద్రతీరంలోని గెస్ట్‌హౌస్ మేడమీద వరండాలో.. జేమ్స్‌తో నీళ్ళూ, సోడా, గ్లాసులూ తెప్పించాక .. ఎదురుగా, అలలూ ... పడవలూ కనిపిస్తుంటే ... హండ్రెడ్స్ పైపర్స్‌ని ఫిక్స్ చేసుకుని చప్పున గ్లాసెత్తి లాగించాక చూస్తే ... నీలాకాశం సముద్రపు నీళ్ళ మీద అలా వచ్చి ఆనుకుని వాలిపోయి అతుక్కున్నట్లుగా సముద్రపు నీళ్ళు ... నీలంగా ... ఆకాశంలాగా ..

"అది కాదు బాస్, ఎన్నాళ్ళు ఎదురు చూస్తావ్? మహర్షి ఏమయ్యాడు! ఎప్పటికి వస్తాడు?'' అడిగాడు యుగంధర్.
"వస్తాడు ... తప్పకుండా'' చెప్తున్న నా గొంతులో ఏదో అడ్డుపడుతోంది.
"లేకపోతే డ్రామా ఆడుతున్నాడేమో! నీకే చాలా ఇవ్వాలి కదా. బయటనుంచి కూడా ఎంతో తెచ్చి ఇచ్చావు. ఎన్నాళ్ళు ఎదురుచూస్తావు. నువ్వు తప్ప అతడ్ని ఎవరూ నమ్మడం లేదు'' అన్నాడు.

నమ్మడం మాత్రమే తెలియడం ... నిజంగా నా తప్పేనా? స్నేహితుల్ని, ప్రేమించిన వాళ్ళని కాక మరెవరిని నమ్మాలి?
జీవితం ముందు నిలబడి ఏదైనా అడిగితే, ఏమీ ఆలోచించకుండా చేసుకుపోవడం, గుండె తలుపులు తట్టి అడిగితే హృదయం, జీవితం, సమస్తం ఇచ్చేసి శూన్యంగా మిగిలిపోవడం ... నేనే ఎందుకిలా? నాకే ఎందుకిలా? నాలా లోకంలో ఎవరూ కనిపించరేం?
"అవునూ ... తను ఏమైంది బాస్! ఎక్కడుంది? ఏమైనా సమాచారం తెలుస్తోందా?'' అడిగాడు యుగంధర్.
ఇప్పుడు అతను అడుగుతోంది కాంచన గురించి. ఏం చెప్పాలి? ఏం తెలుసని? తను స్వేచ్ఛలోంచి బందిఖానాలోకి, అమ్మ, అక్కలు పన్నిన, అల్లిన ముళ్ళకంచెలోకి వెళ్ళిపోయే చివరి ప్రయాణంలో ఇచ్చిన ఎస్సెమ్మెస్ గుర్తొచ్చింది.
"కాల్ మీ వన్స్. ఇక ఎలాగూ నేను నో మోర్ టుబి. కనీసం నీ గొంతైనా చివరిసారి వింటాను'' అంటూ ఆ రాత్రి .. వెంటనే కాల్ చేస్తే ... కాంచన మాట్లాడిన నాలుగైదు చివరి మాటలు, అంతే ... ఇరవై నెలలు. ఏమీ తెలీదు. ఎలా ఉంది? అరె ... తెరుచుకోకపోయినా ... ఎందుకు తెరుస్తావురా ... ఏవో గదుల తలుపుల్ని ... యూ ... రాస్కెల్.

ఇంతలో ఉన్నట్టుండి ... ఏడవడం మొదలుపెట్టాడు యుగంధర్. నా లోపల ఓరగా తెరుచుకున్న తలుపులు చీకట్లోకి మూసుకుపోయాయి. ముందుకి వంగి అతని భుజం మీద చెయ్యేసి "అరె, ఏమయింది ఊరుకో ... ఊరుకో ...'' అని సర్దిచెప్పాలని చూశాను. "లేదు బాస్, తను బాగా గుర్తొస్తోంది. మానసికంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని, అడ్జస్ట్ అయ్యే టైములో ఎందుకు జరిగింది ఇలా? నన్ను, నా కొడుకుని ఒంటరిగా చేసి వెళ్ళిపోయింది. ఎందుకో ఈ మధ్య కళ్ళముందు కనిపిస్తున్నట్టుగానే అనిపిస్తోంది. తను చనిపోలేదేమో?'' చొక్కాతో కళ్ళు తుడుచుకున్నాడు.

అతని భార్య ఈ మధ్యే చనిపోయింది. అతను హైదరాబాద్‌లో, పదేళ్ళ కొడుకు అమ్మమ్మ దగ్గర ఉన్న సమయంలో .. ఉద్యోగం చేసే ఊళ్లో ... ఒంటరిగా, ఒకానొక రాత్రి అప్పటిదాకా అతనితో ఫోన్‌లో మాట్లాడి 'నిద్రొస్తోంది' అని చెప్పి నిద్రలోనే మరో లోకానికి వెళ్ళిపోయింది ఆమె. అతను ఆ షాక్‌లోంచి బయటకి రాలేదు. అప్పుడప్పుడు ఇలా బరస్ట్ అవుతుంటాడు. మౌనంగా కూర్చుండి పోయాడు యుగంధర్.

దూరంగా చూస్తుంటే నీలాకాశం ... నీలంగా ఉన్న సముద్రం .. ఒక దానితో ఒకటి కలిసినట్లుగా ... స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది ఎంత అబద్ధమైనా సరే .. ముమ్మాటికీ నిజంలాగే. కంటికి కనిపించేది నిజం. అయితే ప్రతి నిజమూ సత్యం కాదు. కంటికి కనిపించే వాస్తవం వేరు .. సత్యం వేరు. చాలా సేపటి తర్వాత ఇద్దరి అడుగులూ సముద్రంవైపు సాగాయి.

అలలు ఒకదాని వెంట మరొకటి తీరానికి చేరి విరిగి మళ్ళీ వెనక్కి ... మరొక అల అలాగే. ఇలా నిరంతరం, విసుగు విరామంలేని ఆలోచనల్లా. ఏదో ఒక రోజు మహర్షి తనకి రావాల్సిన డబ్బులతో తిరిగివచ్చి, నా డబ్బులు నాకిచ్చి సమస్యలు తొలిగిస్తాడనీ, అలాగే కాంచన కూడా బందిఖానా నుంచి బయటపడి, మళ్ళీ నా జీవితం ముందు నిలబడి, గుండె తలుపులు తడుతుందని ... ఆ ఆశతోనే ఎక్కడికీ వెళ్ళకుండా ఇలా పగలూ రాత్రీ ప్రతి క్షణం ఇక్కడే ఎదురుచూస్తున్నానని ఎవరికి తెలుసు?

"సముద్రమూ, అలలూ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. మారేది మనుషులే ... మనసులే'' వెనకనుంచి అంటున్నాడు యుగంధర్. ఇతని భార్య ఈ లోకంలో లేదని, ఇక ఎప్పటికీ బతికి రాదనే సత్యం ఇతనికి తెలుసు. ఆమె ఒకవేళ కనిపించినా .. అది కలో, భ్రమో ... అంతే! కానీ, నాకు అలా కాదు. ఏదో క్షణంలో, ఎక్కడో రోడ్డు దాటుతున్నపుడో, బస్టాండ్‌లోనో, రైల్వే ప్లాట్‌ఫారం మీదో .. ఉదయమో, మధ్యాహ్నమో .. లేక ఏ చీకటి రాత్రివేళో ... మహర్షి గానీ కాంచన గానీ .. లేక ఇద్దరూ .. ఎవరికి వారు కళ్ళముందు, జీవితం ముందు వాస్తవంలా కనిపిస్తారనే ఆశ. మౌనాన్ని, నిరీక్షణని జీవితంగా మార్చుకుని క్షణాలు, గంటలు, రోజులు, నెలలు గడిపే నాకు ... అదే శ్వాస, ధ్యాస.
ఇది నిజంగా సత్యం కావచ్చు .. కాకపోవచ్చు. జరగచ్చు .. అసలు జరగక పోవచ్చు .. కానీ అది ఆప్టిమిజం. ఆఫ్ట్రాల్ అది జీవితం! నాదీ, నీదీ, మనలాంటి అందరిదీ ... అంతే!!

...............................................
రచయిత సెల్: 98494 27699 

Wednesday, June 27, 2012

మీ ఒంటరిగా... కవితకు నా స్పందన

వెన్నెలదారి venneladaari: ఒంటరిగా......

వర్మగారూ! ఇంచుమించుగా ఇదే  భావాలూ తో నేను  రాద్దామని అనుకున్నాను. అదేదో టెలిపతి లా మీరు అందుకొనిరాసారు . ప్రపంచం లో మనిషిని పోలిన మనషులు వున్నట్లు భావ సామీప్యం కూడా వుంటుందని నేను ,ప్రిన్స్ గారు కూడా అనుకోకుండా ఒకలాస్పందిచాము
చాలబావుంది

Saturday, June 23, 2012

వర్మగారు,మీ కవిత చాలబావుంది





వర్మగారు,మీ కవిత చాలబావుంది

తలపుల టపా లోని అక్షరాలు వెన్నెల ధార ని పానం చేసి  కవితామృతాన్నిచవి చూపించాయి.
ఆ అమృతధారలో తడిసి ముద్దయ్యి నా మానసం విహంగం లా ఎక్కడికో  సుదూర తీరాలకు సాగిపోతోంది

.......ఫల్గుణిhttp://venneladaari-v.blogspot.in/

Thursday, June 7, 2012

గొప్ప అనువాద నవల" యాజ్ఞసేనిని" గురుంచి నవలా పరిచయం

బ్లాగర్  మిత్రులందరికీ ,

నేను చదివిన ఒక గొప్ప అనువాద నవల 'యాజ్ఞసేని  'ని  గురుంచి నవలా పరిచయం "


శిరాకదంబం అంతర్జాల పత్రిక లోని సాహిత్యం శీర్షిక  పేజి  లో  ప్రచురితం అయినది.  


ఇది  సాహితి అభిమానులందరి తో పంచుకోవాలని  ఒక  చిన్న ఆశ .



విపులం గ  ఈ క్రింది   లింకులో చదవండి 


https://sites.google.com/site/siraakadambam/literature/yajnaseninavalaparicayam-manivadlamani(పూర్వఫల్గుణి)


పూర్వఫల్గుణి



Wednesday, May 30, 2012

గంధం యాజ్ఞవల్క్యశర్మగారి "చదువు' కద

ఈ వారం నవ్యలో(  06/06/2012)గంధం   యాజ్ఞవల్క్యశర్మగారి  "చదువు' కద చాల బావుంది.కార్పోరేట్ కభందహస్తాలలో పిల్లలు ఎలాచిక్కుకు పోతున్నారో చాల విపులం గ వివరంగ రాసారు. పెద్దవాళ్ళుఆలోచనా విధానం కూడా ఎలా   మారుపులు చెందాయో కూడా రాసారు.

అంతా పోటి! ఆ పోటిలలో మన పిల్లలు వుండాలి లేకపోతె వాళ్ళని తక్కువ చేస్తారేమో అనిమాత్రమే  ఆలోచిస్తున్నాం కాని వాళ్ళ మీద యెంత వత్తిడి తెస్తున్నాం  అది ఆ చిన్ని మనసులు తట్టుకోగలవా అనే విచక్షణ మనం కోలుపోతున్నాం. దాని కి తోడూ చిన్నకుటుంబాలు అవడం తో  పెద్దవాళ్ళు లేకపోవడం వెరసి కౌన్సెలింగ్ సెంట్రేర్లు వెలుస్తున్నాయి కాని దాని వల్ల ప్రయోజనం  అంతంత మాత్రమే.

ఈ కధలో మాత్రం తాతగారు ముఖ్యపాత్రవహించి తన మనవడు భాద్యతని స్వీకరించి ఆతని మనసెరిగి అతనికి నచ్చిన చదువు ని ఎంచు కోవడానికి తగిన స్వతంత్రం,ఆలోచన కలగచేస్తాడు.

చాల బావుంది! ఈ రచయిత దే ఒక నవల కూడా వుంది పేరు మర్చిపోయాను. అప్పట్లో ట్యుటోరియల్ కాలేజీ గురుంచి.రాసారు. అది ఏమస్కో వారి ముద్రణ. ఇంచుమించు గ ఇదే కదావస్తువు. కాని పిల్లల గురుంచి కాదు.చదువు చెప్పే మాస్టర్స్ గురుంచి.

 ఏది ఏమియినా ఈ నాటి  విద్యవిదానం,తల్లితండ్రుల దృక్పధం  లోకూడా మార్పు రావాలని రచయత భావం. 





Thursday, May 10, 2012

మాతృమూర్తి "రాధ"


బ్లాగర్ మిత్రులందరికీ 

మాతృదినోత్సవ సందర్భం గా నా మదిలో కలిగిన భావాలకి అక్షర రూపం 
శిరా కదంబం అంతర్జాల పత్రికలో "సాహిత్యం పేజి లో 'మాతృమూర్తి "రాధ" గురుంచి చిన్న వ్యాసం ప్రచురించారు.

చదివి మీ అభిప్రాయం తెలుపగలరు


http://sirakadambam.blogspot.in

Thursday, May 3, 2012

వెన్నెల ధార


బ్లాగర్  మిత్రులందరికీ ,ఈ నెల  "కౌముది అంతర్జాల "  పత్రికలో  నా కవిత  "వెన్నెల ధార' ప్రచురితమయినది 
నా కవితను  ప్రచురించిన   "కిరణ్ ప్రభ  గారికి  ధన్యవాదములు .




                                 వెన్నెల ధార



వెన్నెల ధార! ! జగతి  అంతా కురిసే  వెండి వెన్నెల ధార!!
అంబరం నుంచి  వర్షిస్తున్న ఆనంద అమృతధార  !!
జలతారు పరదాలు చాటు   వెన్నల రేడు కురిపించే   కౌముది ధారలో
ఆమె మోము వున్న చిరు చెమట చినుకులుకాస్త ముత్యములై మెరయు చున్నవి
ఆమె కన్నుల కాటుక నిశిధి ని పోలియుండగా కనుపాపల కాంతి  మిలమిల మెరిసే తారకలు వలెవున్నవి
ఆమె కనుదోయి రాకా చంద్రుని చూసి వికసించిన కలువలేమో అన్నట్లు వున్నవి
ఆమె చెక్కిళ్ళ నిగ్గుటద్దాల లో  ఆ జాబిల్లి తొంగితొంగి చూస్తున్నాడు
ఆమె అధరాల ఫై  తోణికిసులాడుతున్న మధువులొలికించె చల్లనివెన్నెల
ఆమె నాగినివలె హొయలు పోతోంది తెల్లని చిక్కటివెన్నెలమొగలిపూల పానుపు వలెవుంది
ఆమె జడలోని విరిసిన మల్లెలు,ఆ రేరాజు అందంతో పోటి పడుతున్నాయి
ఆమె వదనం పున్నమి చంద్రుని వెండి వెన్నల లా చంద్రకాంతులు వెదజల్లుతున్నది
ఆమె దివినుండిభువికి దిగిన అచ్చెర కన్య వలెవున్నది
ఆమె మూర్తిభవించిన ప్రేమదేవత లావుంది
ఆమె దోశిళ్ళనుండి జాలువారుతున్న  వెన్నల ధార 
ఆనందంగా ఆ అమృత ధార ని పానం చేశాను
జగమంతా నిదురిస్తున్నవేళ  పుచ్చపువ్వులాంటి వెన్నలలో
ఆమె ఒడిలో నేను !  అలౌకికమైన స్వాప్నిక స్తితి!  
అస్తిత్వం వుందా నాకు! ఆమె నేనా? నేనే ఆమెనా?ఏమో?
మానసం విహంగలా ఎగిరిపోతోంది !  అనిర్వచనీయం ఆ అనుభూతి
అంతా ప్రేమమయం! అంతా   ఆనందమయం!
వెన్నెల!  వెన్నెలఎటు చూసిన కురిసే  వెన్నెల ధార



























Tuesday, May 1, 2012

ఈ నెల కౌముది లో నా కవిత" వెన్నెలధార"
 పబ్లిష్అయింది.(mani Vadlamani)


http://koumudi.net/Monthly/2012/may/index.html 





Wednesday, March 28, 2012

శ్రీ రమణ గారి "మిధునం" కధ, తనికెళ్ళ గారి :దృశ్య రూపం


శ్రీ రమణ గారి "మిధునం" కధ
తనికెళ్ళ గారి  :దృశ్య రూపం(సినిమా) గా  గాన
గంధర్వుడే కాదు ,నట గంధర్వుడు అయినా  మన బాలసుబ్రమణ్యం, శ్రీమతి లక్ష్మి ముఖ్య
పాత్రధారులు గా వేస్తె అది ఇంక ఎంత బావుంటుందో
గుత్తి వంకాయ కూరలగా, కొత్తావకాయ లాగా,ఆవపెట్టిన పనస పొట్టు కూరలగా,ఆంధ్రశాకంబరి లేహ్యం అదేనండి మన
గోంగూర పచ్చడిలగా అరటి ఆకులో కమ్మటి పెరుగు తో
మన తెలుగుంటి భోజనం లా వుంటుంది. నమ్మండి!!!!




Friday, March 23, 2012

శిరా కదంబం వారు నిర్వహించిన౧ ఉగాది స్వరాలలో నా స్వరం కూడా గళం విప్పింది

 బ్లాగర్ మితులకి

నందన నామ సం శుభాకాంక్షలు!!


శిరా కదంబం వారు నిర్వహించిన౧ ఉగాది స్వరాలలో నా స్వరం కూడా కలిసింది









మణి మూర్తి వడ్లమాని


http://sirakadambam.blogspot.in







































» 
శిరా కదంబం :   ' శ్రీ నందన ' ఉగాది స్వరాలు.. 

Thursday, March 22, 2012

నందనం, ఆనంద వాసంత నందనం అందుకో మా ఆనంద వందనం 
చేకొనుమా! ఈ ఆనంద వాసంత అభినందనం"

అందరికీ ఉగాది శుభాకాంక్షలు
 

Sunday, March 18, 2012

http://www.andhrapradeshpatrika.com/issues/2011/dec/page18.asp

ఆంద్ర ప్రదేశ్ మాస (డిసెంబర్) పత్రిక లో నా కవిత"వెళ్లిపోయావా ప్రియ నేస్తం" ప్రచురించారు
ఇది నాకు  ఆలస్యం గ తెలిసింది.
ప్రింట్ లో కొన్ని పదాలు సరిగా ప్రచురించలేదు. ఇది నా అసలు కవిత


వెళ్ళిపోయవా  ప్రియ నేస్తం! వెళ్ళిపోయవా  ప్రియ  నేస్తం


వెళ్ళిపోయవా  ప్రియ నేస్తం! వెళ్ళిపోయవా  ప్రియ  నేస్తం

మరోలోకం పిలుపువిని వెళ్ళిపోయవా! నేస్తం

ఏవి  ఇసుకతిన్నల లో కట్టిన సైకత ఆకృతులు? అన్నిమట్టిపాలు చేసి వెళ్ళిపోయావ నేస్తం!

ఏది  మామిడి చెట్టుకు కట్టిన  ఊయల ? ఊగుతూ     ఊగుతూ   తెగిన ఊయలని  వదలి వెళ్ళిపోయవా నేస్తం!

ఏటిలో  చేపలా   ఆ వొడ్డునుంచి ఈ వొడ్డువరకు ఈదుతూ నీ ఊపిరిని  ఏటి పాలు చేసావా   నేస్తం

నువ్వు భౌతికం గ   లేకపోయనా  వో నేస్తం !  నీ స్నేహ పరిమళ గుబాళింపులు నన్ను  పలకరిస్తూనే వున్నాయి

ఈ  మట్టి  వాసనలో నిన్ను నేను  చూస్తున్నాను నేస్తం     ఈ గాలిలో గుసగుసలో నీ  పాట  వింటున్నాను నేస్తం

ఆ ఏటి తరగల మీద నురుగులో  నీ నవ్వు  చూస్తున్నాను నేస్తం   ఆ నవ్వే పువ్వులలో నువ్వేవున్నావు నేస్తం

నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు   నేస్తం  నాతో నే వున్నావు  !! నా వూపిరిలోనే  లోనే వున్నావు   నేస్తం!!












http://www.andhrapradeshpatrika.com/issues/2011/dec/page18.asp 

Friday, March 9, 2012

ఎందరో ఆకాశవాణి మహానుభావులు అందరికి వందనాలు

రేడియో!! అంటే ఇప్పుడు వచ్చేఇదిచాల హాట్ గురు,,ఉల్లాసంగ,ఉత్సాహం గ ,వినువినిపించు ఇత్యాది  ప్రకటన లు
లేకుండా వున్నారోజులు, అలా అనిమరి పాత రోజులు కాదు ఒక 20 ఏళ్ళ  క్రితం వరకు.ఎంత బావుండివో, పొద్దున్న
ఆకాశవాణి శుభోదయం ప్రసారం నుంచి రాత్రిఈ ప్రసారం ఇంతటితో సమాప్తం వరకు.


అప్పటి రోజులలో కూడా రేడియో వినడం మూలం గ విజ్ఞ్యానం పెరిగేది


అప్పుడు రేడియో లోఇంత సినిమా సంస్కృతి లేదు, ఆదివారం వచ్చిందిఅంటే ఒకసంక్షిప్త  శబ్ద చిత్రం వేసేవారు, రోజు
ఒక అరగంట మీరు కోరిన పాటలు వేసేవారు , మిగత కార్యక్రమాలు ఎంతో వినోదభరితం గ, ఇంకా అందరికిఉపయోగపడేవి గ ఉండేవి,


ఇంకాలలితా సంగీతం గురించి చెప్పాలంటే పాలగుమ్మివిశ్వనాధం గారు,   rajanikanta rao
 garu , v b kanakadurga garu, ఇంకా ఎందఱో మహానుభావులు అలాగే ఈ మాసపుపాట
 అనే ప్రోగ్రాం ,అలాగే రేడియో  నాటకాలు,నాటికలు వాటి
భేదం గురుంచి వివరం గ తెలియదు.కాని అన్ని ఆస్వాదించే వాళ్ళం నాకు తెలిసి బందా కనకలింగేశ్వర రావు గారు
నటించిన  " కీర్తిశేషులు" నాటకం ,మురారి పాత్ర,,ఇంకా రావికొందలరావుగారిఒక ప్రొఫెసర్ పాత్ర తో వున్నానాటకం,ఊరుమ్మడిబతుకులు ఇలా ఇంకాఎన్నోచారిత్రాత్మక నాటకాలు
ఎన్నో,ఇంకాహాస్యనాటక లు అందరికి ఎంతోవినోదాన్నిపంచేవే,హైదరాబాద్,విజయవాడ, వైజాగ్ మరియు
కడప, అందరి ప్రోగ్రామ్స్భలేఉండేవి నండూరిసుబ్బారావు,సీతారాత్న్నమ్మ, మ.నాగరత్నం,,శారదశ్రీనివాసన్,చిన్నక్క(రత్నప్రసాద్),రాంబాబు(ఆకెళ్ళ అనుకుంట)జీడిగుంట ఇలా
అందరు మెప్పించేవారు.


గణపతి గ నండూరి ఎంత బాగా నటించేవారో అతని తల్లిపాత్రలో సీతారాత్నమ్మకూడా.
తరువాత కూడా చాల మంది "అల్ ఇండియా రేడియో కి సేవ చేసినవారే,జ్యోత్స్న,ఇలియాస్,మట్టపల్లి
రావు,ఉమాపతి ఈయన గొంతు చాల గంభీరం గ వుండేది.


నేను రాసింది గోరంత చెప్పల్సినది కొండత ఏదోనా శక్తి మేరకుప్రయత్నం చేశాను

ఎందుకో ఒక్కసారి గ అందరు గురుకోచ్చారు, సరే మన బ్లాగర్ మేట్స్ తో నా
భావాలు పంచుకుందామని రాసాను


ఎందరో ఆకాశవాణి మహానుభావులు అందరికి వందనాలు!!!





Wednesday, March 7, 2012

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

ప్రపంచం  లోకెల్లాఅందమైనవారు, అంతకన్నా అందమైన మనసు వున్నవారు
 అన్నిరంగలాలోను అభినివేశం వున్నవారు, మొక్కవోని దైర్య సాహసాలుకలవారు,
 తనవారికోసం నిలబడే ధీసాలులు వారు,కష్టాలను,కన్నీళ్లను లెక్కచెయ్యని వారు,
 స్నేహానికి ప్రాణం ఇచ్చేవారు,మానవత్వానికి విలువనిచ్చేవారు ఇన్ని మాటలెల వారు
 ఈ సృష్టి కే  సృష్టికర్తలు   ఎవరు ఇంకెవరు ఆడువారు
 తల్లిలా,చెల్లిలా,చెలిలా నెచ్చెలిలా,కూతురిలా ఇలా
 ఎన్నో ఎనెన్నో రూపాలను సంతరించుకుంటూ వున్నారు
 అలాంటి ఎందరో స్త్రీ లకి  అబినందనలు
                     అందరకి  ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం  శుభాకాంక్షలు

వో స్త్రీ ఆవేదన!! తల్లి కాలేని తల్లి ఆవేదన!!


వో   స్త్రీ  ఆవేదన!! తల్లి కాలేని  తల్లి ఆవేదన!!

అమ్మాయి పుట్టింది!  మహాలక్ష్మి అన్నారు!
అమ్మాయి బాగా చదవుతోంది!  సాక్షాతూ  చదువలసరస్వతి అన్నారు!
అమ్మాయి కి ఈడు  వచ్చి పెళ్లి జరిగింది! సాక్షాతూ ఆదిదంపతులు అన్నారు!
ఇంతవరకు అమ్మాయిలో అన్ని దేవతలను చూసారు!
అప్పుడు ఆమె  మౌన మూర్తి  వినటమే తప్ప  మాటలాడటం ఎరుగదు!
మరి  నేడు అందరు   ఆమెని రాక్షసి అని బరితెగెంచిదని!అంటున్నారు
కారణం ఇప్పుడు నోరు తెరచింది స్వతంత్ర జీవనం కావాలి అంటోది!
తనకు మాతృత్వం ఇవ్వన్ని వివాహబంధం వద్దు అంది!
అదేపురాణాల స్త్రీలు చేస్తే తప్పు పట్టని సమాజం ! తనకి ఎందుకు
న్యాయము చెయ్యరూ అని అడిగింది! అమ్మతనం కావాలని  కోరుకోవడం తప్పా అని ప్రశ్నించిది?
ఏదిన్యాయము ! ఏది ధర్మం అని క్రోసించింది   స్ర్తీ హృదయం!
ఎవరు ఆమెకి న్యాయము చెయ్యలేదు. వేరే దారి లేక మరణాన్ని ఆశ్రయించింది!
మండుతున్న మనసుతోపాటు  తనువు కూడా  అగ్నికి ఆహుతి అయ్యింది!
ఆహ!  నిజంగా నీవు  సతివే  సుమా  అని  అందరు వేనోళ్ళ పొగిడారు!
ఆమె మరణం  తో మరింత దివ్యత్వాన్ని పొందింది అని ఆనందించారు!
అంతే కానీ ఆమె నిండునూరేళ్లు అర్ధం లేకుండా ముగిసాయని ఎవరు అనలేదు.
ఎవరు అర్ధం చేసుకుంటారు   వో   స్త్రీ   నీ    గుండె లోతుల బాధని
ఎవరు అర్ధం చేసుకుంటారు తల్లీ  నీ ఆవేదనని? ఎవరు? ఎవరు???