Wednesday, May 30, 2012

గంధం యాజ్ఞవల్క్యశర్మగారి "చదువు' కద

ఈ వారం నవ్యలో(  06/06/2012)గంధం   యాజ్ఞవల్క్యశర్మగారి  "చదువు' కద చాల బావుంది.కార్పోరేట్ కభందహస్తాలలో పిల్లలు ఎలాచిక్కుకు పోతున్నారో చాల విపులం గ వివరంగ రాసారు. పెద్దవాళ్ళుఆలోచనా విధానం కూడా ఎలా   మారుపులు చెందాయో కూడా రాసారు.

అంతా పోటి! ఆ పోటిలలో మన పిల్లలు వుండాలి లేకపోతె వాళ్ళని తక్కువ చేస్తారేమో అనిమాత్రమే  ఆలోచిస్తున్నాం కాని వాళ్ళ మీద యెంత వత్తిడి తెస్తున్నాం  అది ఆ చిన్ని మనసులు తట్టుకోగలవా అనే విచక్షణ మనం కోలుపోతున్నాం. దాని కి తోడూ చిన్నకుటుంబాలు అవడం తో  పెద్దవాళ్ళు లేకపోవడం వెరసి కౌన్సెలింగ్ సెంట్రేర్లు వెలుస్తున్నాయి కాని దాని వల్ల ప్రయోజనం  అంతంత మాత్రమే.

ఈ కధలో మాత్రం తాతగారు ముఖ్యపాత్రవహించి తన మనవడు భాద్యతని స్వీకరించి ఆతని మనసెరిగి అతనికి నచ్చిన చదువు ని ఎంచు కోవడానికి తగిన స్వతంత్రం,ఆలోచన కలగచేస్తాడు.

చాల బావుంది! ఈ రచయిత దే ఒక నవల కూడా వుంది పేరు మర్చిపోయాను. అప్పట్లో ట్యుటోరియల్ కాలేజీ గురుంచి.రాసారు. అది ఏమస్కో వారి ముద్రణ. ఇంచుమించు గ ఇదే కదావస్తువు. కాని పిల్లల గురుంచి కాదు.చదువు చెప్పే మాస్టర్స్ గురుంచి.

 ఏది ఏమియినా ఈ నాటి  విద్యవిదానం,తల్లితండ్రుల దృక్పధం  లోకూడా మార్పు రావాలని రచయత భావం. 





4 comments:

  1. Andhra jyothy website lo Latest edition 30/5/2012 edition navya undi. Bahusaa next edition lo undochu meeru cheppina katha.

    ReplyDelete
    Replies
    1. కథ ఈ రోజే చదివానండి! చాలా బాగుంది. అందరం ఇంచు మించుగా ఏ దేశం లో ఉన్న ఇలాగే కొట్టుమిట్ట్లాడుతున్నాము.

      Delete